రంగనాయక సాగర్ లో యువకుల ఈత.. హరీష్ రావు ఏమన్నారంటే...

May 4, 2020, 2:43 PM IST

సిద్ధిపేట రంగనాయక సాగర్, ప్రధాన కాలువలకు గోదావరి జలాలు రావడంతో.. స్థానిక యువత ఆనందంతో కాలువల్లో ఈతలు కొట్టడం ప్రారంభించారు. వారిని చూసిన మంత్రి హరీష్ రావు ఆప్యాయంగా. ఏం సంగతి బిడ్డ.. కాల్వల్లో ఈత కొడుతున్నారా.. అంటూ పలకరించారు. మా ఊర్లకు నీళ్లు వచ్చినయ్ సార్. ఇక మాకు సంబరమైతుందని..  అందుకే కాలువల్లో ఈత కొడుతున్నట్లు.. యువకులు చెప్పుకొచ్చారు. పొద్దున్న, సాయంత్రం ఈత కొట్టాలని అసలే ఎండాకాలం ఈ సమయంలో.. ఈతలు కొట్టాలని యువకులకు మంత్రి హితవు పలికారు. కాళేశ్వరం నీళ్లు కాల్వల ద్వారా గ్రామాల్లోకి చేరడంతో.. ఈతరం మారుతున్నదని స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి ముచ్చటించారు.