జగిత్యాలలో వరుసగా బాలింతల మృతి ... రోడ్డెక్కిన బాధిత కుటుంబాలు

Nov 29, 2022, 4:33 PM IST

జగిత్యాల : ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లా మాతా శిశు హాస్పిటల్లో వరుసగా బాలింతల మృతి కలకలం రేపుతోంది. హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లతో ఇతర వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ఈ మరణాలకు కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిలకు సరయిన వైద్యం అందించకపోవడం వల్లే మరణిస్తున్నారని... ఇలా మహిళల మృతికి బాధ్యులైన డాక్టర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.