గజ్వెల్ లోని సింగయా పెల్లి ఫారెస్ట్ నర్సరీ ని సందర్శించిన ప్రజాప్రతినిధులు..

Feb 19, 2020, 9:51 AM IST

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన పట్టణ ప్రగతి రాష్ట్ర స్థాయి సన్నాహకం సమావేశం అనంతరం మంత్రులు ఫారెస్ట్ యాత్ర చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, స్మశాన వాటికలను, సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం సింగయా పెల్లి ఫారెస్ట్ నర్సరీ ని సందర్శించారు. వీరిలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల చైర్మన్లు ఉన్నారు..