Feb 12, 2020, 3:39 PM IST
సపోటా గింజ గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో జరిగింది. మల్లపూర్ కు చెందిన అనుపురం సుజాత, లింగాగౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు. లింగాగౌడ్ సౌదీలో పనిచేస్తున్నాడు. సుజాత బీడీ కార్మికురాలు. వీరి రెండో కొడుకు శివకుమార్ ఇంట్లో ఉన్న సపోటాపండు తింటుండగా గొంతులో గింజ ఇరుక్కుంది. దీంతో శ్వాస ఆడలేదు. వెంటనే బాలుడిని కుటుంబీకులు మెట్పల్లి ప్రాంతీయాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్ కన్నుమూశాడు.