ఇసుక మాఫియా.. వాగులో పూడ్చిపెట్టిన శవాలు బయటపడేలా...

Nov 19, 2020, 1:36 PM IST

కరీంనగర్ జిల్లా లో ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. రామడుగు మండలంలోని వాగులో ఇసుకను యధేచ్చగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇలా ఇసుక కోసం జరిపిన తవ్వకాల్లో వాగులో పూడ్చిపెట్టిన శవాలు సైతం బయటికి వస్తున్నాయి. శవాలు బయటికి రావడంతో రామడుగు గ్రామస్థులు తీవ్ర అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై పలుమార్లు పోలీసులకి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం వల్లనే  ఇసుక మాఫీయా రెచ్చి పోతోందని అంటున్నారు.