సజ్జనార్ ఒళ్లో కూర్చుని... ఆర్టిసి బస్సులో నిమజ్జనానికి తరలిన బొజ్జ గణపయ్య

Sep 19, 2021, 11:10 AM IST

హైదరాబాద్: ఇటీవలే తెలంగాణ ఆర్టిసి ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ అక్కడకూడా తన మార్క్ చూపిస్తున్నారు. ఆర్టిసి బాధ్యతలు చేపట్టిన వెంటనే సాధారణ పౌరుడి మాదిరిగా ఆర్టిసి బస్సులో ప్రయాణించిన ఆయన తాజాగా మరోసారి బస్సెక్కారు. అయితే ఈసారి బొజ్జ గణపయ్యతో కలిసి బస్సెక్కారు. ఆర్టిసి ఉద్యోగులతో కలిసి బస్సులో వినాయక నిమజ్జనానికి బయలుదేరారు సజ్జనార్. సాంప్రదాయ వేషధారణలో వినాయక విగ్రహాన్ని ఒళ్లో పెట్టుకుని బస్సులో ప్రయాణించారు ఎండీ సజ్జనార్. ఈ సందర్భంగా బస్సులోనే బ్యాండ్ చప్పుళ్లు, ఉద్యోగుల డ్యాన్సులు, కేరింతల మధ్య గణపయ్య నిమజ్జనానికి తరలారు.