భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, 5 నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ తీసుకోవడం తప్పనిసరి. స్లీపర్ కోచ్లలో మీ పిల్లలకు సీటు అవసరం లేకపోతే సగం టికెట్ తీసుకోవచ్చు. సగం టికెట్ తీసుకుంటే తల్లిదండ్రులు తమ పిల్లలను తమ సీట్లోనే కూర్చోబెట్టుకోవాలి. సగం టికెట్ తీసుకున్నా పిల్లలకు ప్రత్యేక సీటు కేటాయించబడదు.