Jul 3, 2019, 4:12 PM IST
శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, డిఆర్ఐ ఆధికారుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించి సౌదీ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ నుంచి దిగిన ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి బంగారాన్ని తెచ్చిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 2.17 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.