విద్యార్థులతో ఎమ్మెల్యే క్రాంతి భోజనం (వీడియో)

Jul 23, 2019, 3:28 PM IST

మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలోని ఎస్సీ గురుకుల మహిళ కాలేజీని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు వండుతున్నారని విద్యార్ధినులు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులకు రుచికరమైన ఆహరాన్ని అందించాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అధికారులను ఆదేశించారు. పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడితే సహించబోమని హెచ్చరించారు. అనంతరం ఆయన విద్యార్ధినులతో కలిసి భోజనం చేశారు.