బాధ్యులపై చర్యలు తప్పవు: మంత్రి జగదీష్ రెడ్డి (వీడియో)

Apr 23, 2019, 3:03 PM IST

ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పులు చేసిన వారెవరైనా వారిపై చర్యలు తీసుకొంటామని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకొంటామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.