సంగారెడ్డిలో వర్ష బీభత్సం : పరిశీలించిన మంత్రి హరీశ్ రావు..

Oct 15, 2020, 1:12 PM IST

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో రహదారులు కోతకు గురయ్యాయి. రాయికోడ్ మండలం లోని సింగీతం గ్రామంలో వర్షానికి కోతకు గురైన రహదారిని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. హరీష్ రావుతో పాటు శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్, జిల్లా కలెక్టర్ హనుమంతరావులు కూడా ఉన్నారు