Apr 23, 2019, 3:26 PM IST
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో పొలం వద్ద ఓ వ్యక్తి తన అక్కపై, బావపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బావ మృతి చెందగా, అక్క పరిస్థితి విషమమంగా ఉంది. ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.