Feb 27, 2020, 5:27 PM IST
ఉమ్మడి నల్గొండజిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామ సమీపంలో ఎలిమినేటి మాధవరెడ్డి కాలువలో ఓ కారు బోల్తా పడింది.పెళ్లి నుండి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కారు ముందు టైరు పేలడంతో అదుపుతప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగ ఓ బాలుడిని మాత్రం స్థానికులు కాపాడారు.