టీవీ చూస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా మంత్రి పువ్వాడ

Mar 22, 2020, 6:27 PM IST

ప్రధాని పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం ఏడు గంటల నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. మరోవైపు నిత్యం రాజకీయాలు, ఎత్తులు, పై ఎత్తులతో క్షణం తీరిక లేకుండా గడిపే రాజకీయ నాయకులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబసభ్యులతో ఇంట్లో టీవీ చూస్తూ గడిపారు.