అక్రమసారా తయారీ.. అడ్డుకున్న తహసీల్దార్ పై దాడి.. మహిళా అధికారిని బూతులు తిడుతూ...

May 21, 2020, 11:13 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల తహశీల్దార్ శ్రీనివాస్ పై అక్రమ సారా గుడుంబా తయారీదారులు దాడి చెయ్యడం అమానుషమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్  ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ సారా, మద్యం అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల సంయుక్తంగా తనికీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోశ్రీనివాస్ తహశీల్దార్ ఆధ్వర్యంలో బుధవారం ఎక్సైజ్ సిబ్బంది ఆడివానపల్లి తండాలో తనికీ చేస్తుండగా సారా, గుడుంబా తయారీదారులు దాడిచేసి విధులకు ఆటంకం కలిగించారు. వీరిని వెంటనే అరెస్టు చేసి తగుచర్యలు తీసుకోవాలని జిల్లా ట్రెసా సంగం  డిమాండ్ చేస్తుంది.