మండువేసవిలోనూ హాయిగా సేదతీరుతున్న వన్యప్రాణులు

May 16, 2020, 4:48 PM IST

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ తీసుకుంటున్న చర్యలతో వన్యప్రాణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. మండు వేసవిలోనూ గడ్డి, నీటి లభ్యత ఉండేలా అటవీశాక తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వన్యప్రాణులు ఎక్కువగా తిరిగే చోట్ల పశుగ్రాసం మేటలు, నీటిగుంటలు తవ్వించడం, సోలార్ పంపుల ఏర్పాటుతో మండువేసవిలోనూ వన్యప్రాణులు హాయిగా సేదతీరుతున్నాయి. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని జంతు సంపద ఈ వీడియోలో..