చేపల వలలో చిక్కిన మొసలి.. షాక్ లో మత్స్యకారులు...

May 16, 2020, 10:18 AM IST

జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం దొంతపూర్ వద్ద గోదావరి నదిలో చేపలకోసం మత్స్యకారులు వేసిన వలలో మొసలి చిక్కింది. వలను బైటికి లాగిన మత్స్యకారులు మొసలిని చూసి భయాందోళనలకు గురయ్యారు. అటవీ అధికారులకు సమాచారం అందించగా.. ఫారెస్ట్ అధికారుల ఆదేశాల మేరకు మొసలిని తిరిగి గోదావరిలోకి వదిలేశారు.