రేవంత్ దిష్టిబొమ్మకు శవయాత్ర... స్వయంగా పాడెమోసిన ఎమ్మెల్యే రసమయి

Jul 12, 2023, 5:03 PM IST

కరీంనగర్ : తెలంగాణ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసారంటే బిఆర్ఎప్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. హైదరాబాద్ లోని విద్యుత్ సౌదతో పాటు రాష్ట్రంలోని విద్యుత్ కార్యాలయాల వద్ద బిఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో కూడిన పాడెను స్వయంగా ఎమ్మెల్యే రసమయి మోసారు. బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి శవయాత్ర నిర్వహించి రాజీవ్ రహదారిపై రేవంత్ దిష్టిబొమ్మను దగ్దం చేసారు ఎమ్మెల్యే రసమయి.