జగిత్యాల : నులిపురుగుల మందు చిన్నారి ప్రాణాలు తీసింది

Feb 11, 2020, 10:12 AM IST

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘోరం జరిగింది. నులిపురుగుల నివారణకు ఇచ్చిన మాత్రలు వికటించి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. సహస్ర అనే ఎనిమిదేళ్ల పాప చనిపోయింది. చాలామంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.