పట్టాభి వ్యాఖ్యల దుమారం: తిడితే తిట్టాలని రూల్ ఏమీ లేదు

Oct 22, 2021, 11:24 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకుంది. తనపై Pattabhi చేసిన వ్యాఖ్యల అర్థాన్ని చెబుతూ YS Jagan తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పట్టాభి చేత అలా మాట్లాడించడం వెనక చంద్రబాబు వ్యూహం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. Chandrababu 36 గంటల నిరసన దీక్షకు దిగారు. దానికి ప్రతిగా వైసీపీ జనాగ్రహ దీక్షలకు దిగింది. మొత్తం ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య సంభాషణ చచ్చిపోయి యుద్ధవాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రజలు ప్రేక్షకులవుతున్నారు