ఏపి రాజకీయాలు: వైఎస్ జగన్ కు డేంజర్ బెల్స్

Mar 31, 2023, 11:08 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావడానికి ప్రాతిపదిక ఏర్పడుతోంది. తాము, జనసేన, టిడిపి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సిపిఐ నేత నారాయణ చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య సూత్రప్రాయంగా ఓ అంగీకారం కుదిరినట్లు దీన్ని బట్టి అర్ణమవుతోంది. ఎన్నికల నాటికి బిజెపి కూడా ఆ పార్టీలతో కలిసి వస్తుందా అనే ప్రశ్న ఉండనే ఉంది. మొత్తం మీద వైఎస్ జగన్ కు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు చెప్పవచ్చు. ఆయన తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. పార్టీలో ధిక్కారం కూడా కనిపించడం వైఎస్ జగన్ నాయకత్వానికి ఓ సవాల్.