Jan 27, 2020, 10:34 AM IST
మధ్యప్రదేశ్, ఇండోర్లో ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు కొట్టుకున్నారు. పార్టీ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జెండా ఎగిరేసే కార్యక్రమంలో దేవేంద్ర సింగ్ యాదవ్, చందు కుంజీర్ అనే ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. ఇది కొట్టుకోవడం దాకా వెళ్లింది. తరువాత పోలీసుల జోక్యంతో శాంతించారు.