నిర్భయ కేసు : నిందితుడు అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

Jan 31, 2020, 5:03 PM IST

నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ క్యురేటివ్ పిటిషన్‌ను జనవరి 30 న సుప్రీంకోర్టు కొట్టివేసింది. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఈ ఐదుగురు జడ్జీలు, దేశాధ్యక్షుడు ఏమైనా దేవుళ్లా, వాళ్లెప్పుడూ తప్పు చేయలేదా అంటూ మండిపడ్డారు. అంతేకాదు పవన్ కుమార్ గుప్తా జువెనాలిటీ మీద రివ్యూ పిటిషన్ చేస్తాం అని అన్నాడు. పాటియాలా హౌస్ కోర్టులో నిర్భయ నిందితులకు మరణశిక్షపై స్టే కోసం దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే