కరోనావైరస్ : దేశంలో 50 కేసులు..16మంది ఇటాలియన్లే...

Mar 11, 2020, 2:05 PM IST

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్ దేశంలోని కరోనావైరస్ కేసుల గురించి తాజా సమాచారాన్ని ఇచ్చారు. దేశం మొత్తంమీద ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 50 ఉన్నాయి. వీరిలో 34మంది భారతీయులు కాగా, 16 మంది ఇటలీపౌరులు. ఇప్పటివరకు కరోనా కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని తెలిపారు.