Aug 9, 2019, 6:08 PM IST
బెంగుళూరు: ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి, విజయపుర, బాలకోట్, రాయిచూరు, యాద్గిర్ జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి.ఈ వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా ఇళ్లు, పంటలు నీట మునిగాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం యడియూరప్ప ఏరియల్ సర్వే నిర్వహించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సీఎం తనిఖీ చేశారు.