Jun 16, 2020, 1:15 PM IST
పెన్షన్ ఇవ్వడానికి ఫిజికల్ వెరిఫికేషన్ అంటూ ఓ వృద్ధురాలిని సతాయించిన కేసులో ఓ గ్రామీణబ్యాంకు మేనేజర్ సస్పెండ్ అయ్యాడు. వివరాల్లోకి వెడితే ఒడిశాలోని నౌపద జిల్లాలోని ఓ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వందేళ్ల మహిళ పెన్షన్ విషయంలో ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటే తప్పా డ్రా చేసుకోనివ్వనన్నాడు. దీంతో 70 యేళ్ల ఆమె కూతురు తల్లిని మంచంతో సహా లాక్కొచ్చింది. ఇదంతా వీడియో తీయడంతో వైరల్ అయి ఆ బ్యాంకు మేనేజర్ సస్పెండ్ దాకా వెళ్లింది.