telangana bandh video: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్ బస్టాండ్

Oct 19, 2019, 12:45 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వామపక్ష నాయకులు ఇచ్చిన బంద్ సందర్భంగా బస్సులు నిలిచిపోవడంతో కరీంనగర్ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఈరోజు డ్యూటీ చేయడానికి రాకపోవడంతో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే కరీంనగర్ బస్టాండ్ నేడు ఒక్కరు కూడా లేక బోసిగా కనిపిస్తుంది.