Oct 6, 2019, 6:14 PM IST
బతుకమ్మను తెలంగాణ ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన ఎల్బీ స్టేడియానికి మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారని తెలిపారు.
దేవుడి దయ వలన రాష్ట్రంలో మంచి వర్షాలు కురిశాయని... పల్లెల్లో ఈ ఏడాది పండుగ ఘనంగా జరుపుకుంటున్నారని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు చివరి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ ట్యాంక్బండ్పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. వేడుకల నేపథ్యంలో ట్యాంక్బండ్, హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.