Feb 15, 2020, 11:41 AM IST
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వస్తున్న కొత్త సినిమా చావు కబురు చల్లగా. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం గురువారం ఫిల్మ్నగర్ దైవ సన్నిధానంలో మొదలైంది. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు కాగా, బన్నీ వాసు నిర్మాత. ముహూర్తపు షాట్ కి అల్లు అరవింద్ మనమరాలు బేబి అన్విత క్లాప్ ఇవ్వగా, అల్లు ఆయాన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.