ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్న బాలు, వీడియో వైరల్

Sep 25, 2020, 5:28 PM IST

చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో దాదాపు రెండు నెలలుగా చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆగస్టు 5న ఎస్పీబీ ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు బాలు ఆరోగ్యం విషమంగా ఉందని ప్రతిరోజూ మీడియాలో కథనాలు వచ్చేవి.

అయితే ఆగస్టు 28 నాటికి బాలసుబ్రమణ్యం ఆరోగ్యం  కుదుటపడినట్లుగా తెలుస్తోంది. ఆయన స్వయంగా ఫిజియోథెరపి చేసుకుంటున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందిగా వైద్య సిబ్బంది బాలసుబ్రమణ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిదన్న దానిపై క్లారిటీ రావాల్సి వుంది.