వరసిద్ధి వినాయకుడి అభివృద్ధికి సహకరించండి (వీడియో)

Oct 10, 2019, 12:48 PM IST

కాణిపాకం అభివృద్ధి వేగవంతం చేసేందుకు అన్నిశాఖలు, ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. బుధవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ అమలు అనే విషయమై వివిధ శాఖల అధికారులు, ఆలయ ఈవో దేవుళ్ళు, ఎమ్మెల్యే ఎం ఎస్ బాబులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అభివృద్ధి వేగవంతం చేయాలని తెలిపారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులు మొదలు అన్ని వర్గాల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దేవుళ్ళుAC కస్తూరి  A E O విద్యాసాగర్రెడ్డి, రవీంద్రబాబు, సూపరిండెంట్ ప్రసాద్ తదితరులు