Oct 21, 2019, 1:08 PM IST
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని 29వ వార్డు మల్లికాసులపేటలో ఓ ఇంట్లో మంటలు చెలరేగి సుమారు 40 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు 30 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది.