Oct 9, 2019, 1:30 PM IST
నల్లమల సమీపంలోని స్వయంభూ మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దసరా ఉత్సవాల తొమ్మిదవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకారాలు చేశారు. దసరారోజుతో నవదుర్గా అలంకారం మరియు సహస్ర దీపోత్సవం ముగిసింది. శాస్త్రం ప్రకారం సహస్ర దీపాల ఉద్వాసన చేశారు. ఉత్సవాల చివరి రోజు ఆలయ పరిసరాల్లో ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురువటంతో అమ్మవారి గ్రామోత్సవం రద్దు చేశామన్నారు అధికారులు.