పంజాబ్ వర్సెస్ బెంగళూరు: కోహ్లీసేనకు పంజాబ్ చేతిలో వరుసగా రెండవ ఓటమి

Oct 16, 2020, 1:43 AM IST

IPL 2020 సీజన్‌లో వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ వేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మొదటి విజయం దక్కిన రాయల్ ఛాలెంజర్స్‌పైన రెండో విజయాన్ని అందుకుంది కెఎల్ రాహుల్ టీమ్. 172 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 8 వికెట్ల తేడాతో టార్గెట్‌ను అందుకుని ఘనవిజయం సాధించింది. తేలిగ్గా గెలుస్తుందని అనుకున్న మ్యాచ్‌ను ఆఖరి బంతితాకా తీసుకొచ్చి, ఉత్కంఠ రేపారు పంజాబ్ ప్లేయర్లు.