హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ : సమిష్టి విజయం సాధించిన వార్నర్ సేన

Oct 9, 2020, 12:44 AM IST

IPL 2020 సీజన్ 13లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 202పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 132 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నికోలస్ పూరన్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మయాంక్ అగర్వాల్ 9 పరుగులకే రనౌట్ కాగా, సిమ్రాన్ సింగ్ 11, కెఎల్ రాహుల్ 11, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 7, మన్‌దీప్ సింగ్ 6, ముజీబ్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరగా... నికోలస్ పూరన్ ఒక్కడూ ఒంటరి పోరాటం చేశాడు.