Oct 11, 2020, 1:18 AM IST
IPL 2020 సీజన్ 13లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చిత్తుగా ఓడి, ఫ్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది ధోనీ సేన.170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్...20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. 37 పరుగుల తేడాతో చెన్నైపై ఐపీఎల్ చరిత్రలోనే ఘన విజయం అందుకుంది ఆర్సీబీ.