చచ్చిపోయాడా? చంపేశారా?.. కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహం...

Jun 1, 2020, 3:06 PM IST

కృష్ణాజిల్లా, నందిగామ, కంచికచర్ల మండలం గండేపల్లి చెరువు సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించింది. గండేపల్లి సెంటిని ఫ్యాక్టరీ చెరువు సమీపంలో ఎండిపోయిన నీటి గుంటలో ఉరి వేసుకుని బలవన్మరణం పొందిన యువకుడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో యువకుడి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఎముకలు బయటపడి లభించింది. పోలీసుల దర్యాప్తులో గండేపల్లి ఊరి శివార్లలో ద్విచక్ర వాహనం లభించింది. పోలీసులు యువకుడు ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.