ఆపద సమయంలో రాజకీయాలా..పవన్ ట్వీట్ పై అంబటి ఆగ్రహం...

Mar 30, 2020, 6:47 PM IST

కరోనా వ్యాధి అరికట్టడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు  రాజకీయాలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  మీడియాలో జగన్ గారిని, ప్రభుత్వాన్ని దూషిస్తూ ప్రచారమా?విపత్తు వేళ పనిచేస్తున్న వారికి రాజకీయాలు అంటగడతారా? సేవలు అందిస్తున్న వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్టా?సర్వత్రా వాలంటీర్లపై ప్రశంసలు వస్తుంటే రాజకీయాలేంటి పవన్..?రాజకీయాలు చేయటానికి ఇది సరైన సమయం కాదంటూ విమర్శించారు.