Jun 3, 2020, 11:38 AM IST
ఈ నెల 8 నుంచి కోవిడ్ నిబంధనలు సడలించి పర్యాటకానికి పర్మిషన్స్ ఇస్తామని మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నంలోని ప్రభుత్య అథిది గృహంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టూరిజం, ప్రైవేట్ హోటలకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా
వినియోగదారులు ఆన్ లైన్ లో వీటిని బుక్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ పునః ప్రారంభానికి కొన్ని నిబంధనలు, నియమాలపై త్యరలో విజయవాడలో వివిధ హోటల్ సంఘాలతో చర్చలు జరుపుతామన్నారు.