Telugu news updates: నేటి ముఖ్యవార్తలు

Dec 26, 2019, 7:29 PM IST

ఏపీకి మూడు రాజధానులు అంశం టీడీపీలో చిచ్చును రేపింది.విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్, ఎన్ఆర్‌సీపై చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ విశాఖ మాజీ ఎమ్మెల్యే రహమాన్ టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే రహమాన్ వైసీపీలో చేరనున్నారు.ఐదు దశాబ్దాల తర్వాత  సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణం దేశంలోని పలు ప్రాంతాల్లో కన్పించింది. సూర్యగ్రహణాన్ని చూడలేదని  ప్రధాని చూడలేదని  ట్వీట్ చేశారు. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచి ఉంచారు. ఈ ఆలయంలో భక్తులు ఇవాళ పూజలు చేశారు.ఏపీకి మూడు రాజధానుల అంశం ఏపీలో చిచ్చును రేపుతోంది. ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది.ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీకి ఆమోదముద్ర వేయనున్నారు. ఏపీకి మూడు రాజధానులు వద్దంటూ అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఎనిమిది రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు