దొంగ ఓట్ల ఆరోపణలు... సత్తెనపల్లిలో వైసిపి-టిడిపి శ్రేణుల భాహాభాహీ

Mar 10, 2021, 2:41 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో 24వ వార్డ్ లోని పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టిడిపి నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య తోపులాట జరిగింది. దీంతో హుటాహుటిన పోలీసులు రంగ ప్రవేశం ఇరువర్గాలను నచ్చజెప్పి అక్కడినుండి పంపించారు.