అమరావతిలో పోలీసుల జులుం.. టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన

Jan 12, 2020, 5:53 PM IST

అమరావతిలో నిరసన దీక్షలో పాల్గొన్న రైతులపై పోలీసులు చేస్తున్న అరాచకాలపై టీడీపీ ఎమ్మెల్యే, విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేశ్ కుమార్ వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. విశాఖపట్నంలోని ఒకటవ, హార్బర్ పోలీస్ స్టేషన్ అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అంతేకాకుండా స్టేషన్‌ ఆవరణలో పార్క్ చేసి వున్న పోలీసు వాహనాలను శుభ్రపరుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అర్బన్ జిల్లా నాయకులు చిన రెహ్మాన్, చక్రవర్తి, రామానంద్, జాఫరుల్లాహ్, వార్డ్ ప్రెసిడెంట్స్ బాపు ఆనంద్, సూర్యనారాయణ, నరసింహచారి, నాగేంద్ర, పరదేసి యాదవ్, చిన్ని కుమార్, దుర్గ రెడ్డి , డొకర రమణ,  రవి శంకర్, సత్యనారాయణ రెడ్డి,  మాణిక్యం,  మహేష్, శివ ప్రసాద్, భాషా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.