మళ్లీ తెరపైకి విశాఖ రాజధాని... జగన్ ప్రకటన వెనక కారణమదే..: పయ్యావుల కేశవ్

Feb 1, 2023, 5:13 PM IST

అనంతపురం : దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగిన గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖపట్నమే అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పందించారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుండి ప్రజల దృష్టి మరల్చడానికే ఉన్నపళంగా మళ్ళీ ఏపీ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. వివేకా హత్యకేసులో సిబిఐ వేగం పెంచిందని... ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి సెల్ ఫోన్ సంభాషణ కీలకంగా మారిందన్నారు. ఎక్కడ ఈ కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి వస్తాయోననే ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేసారన్నారు. ఏపీ రాజధాని అమరావతే అని హైకోర్టు స్పష్టం చేసిందని... అయినా రాజధాని విశాఖపట్నమే అంటూ సీఎం జగన్ ప్రకటించడం కోర్టు దిక్కరణే అవుతుందని పయ్యావుల పేర్కొన్నారు.