Jan 7, 2020, 4:31 PM IST
రాజధాని రైతులు మంగళవారం జాతీయ రహదారుల దిగ్భందానికి పిలుపు నిచ్చారు. దీంట్లో భాగంగా నిరసనకారులకు నారా లోకేష్ మద్దతు తెలిపారు. రహదారుల దిగ్భందంలో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ని బెంజ్ సర్కిల్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.