మేం చేసిందిదే... మీరేం చేసారో చెప్పగలరా జగన్ రెడ్డి..: నారా లోకేష్

Mar 6, 2023, 1:29 PM IST

అమరావతి : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడులు రాబట్టినట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఈ నాలుగేళ్ల పాలనలో అనేక కంపనీలను ఏపీకి తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ తో సహా వైసిపి నాయకులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.టిడిపి హయాంలో జిల్లాల వారిగా ఏయే కంపనీలు తీసుకువచ్చారో, ఎంతమందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించారో లోకేష్ వివరించారు.ఇలాగే సీఎం జగన్ కూడా ఈ నాలుగేళ్లలో ఏం సాధించారో చూపించగలరా? అని లోకేష్ ప్రశ్నించారు.