దాసరి చేత కంటతడి పెట్టించిన హీరోయిన్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

First Published Sep 22, 2024, 8:55 PM IST

సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండి అకాల మరణం పొందారు దాసరి నారాయణ రావు. ఆయన గతంలో ఓహీరోయిన్ వల్ల కంటతడి పెట్టే పరిస్థితి వచ్చిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? దాసరి ఎందుకు ఏడ్చారో తెలుసా..? 
 

సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు దాసరి నారాయణ రావు. టాలీవుడ్ కు ఏ సమస్య వచ్చినా... ఆయన ముందుండి దానికి పరిష్కారం చూపించేవారు. ఎందరికో అవకాశాలు ఇచ్చి.. దారి చూపించిన దేవుడుగా దాసరి నిలిచారు. 

Also Read: జయసుధను జుట్టుపట్టి కొట్టిన హీరోయిన్ ఎవరు..?

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్లుగా గౌరవం పొందుతున్న ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు దాసరి శిష్యులే, మోహన్ బాబు దగ్గర నుంచి ఆర్ నారాయణ ముర్తి వరకూ దాసరి ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టినవారే. 

ఇక ఇండస్ట్రీలో చిన్న లైట్ బాయ్ దగ్గర నుంచి స్టార్ హీరో వరకూ.. టాలీవుడ్ లో మనుగడ సాగించాలి అంటే..దాసరి దర్శనం చేసుకోవల్సిందే. ఎంతోమందికి జీవనాదారం చూపించడంతో పాటు.. సమస్య పరిష్కారం కోసం తన ఇంటికి వచ్చిన చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద స్టార్ వరకూ ఎవరైనా సరే భోజనం చేయకుండా పంపించేవారు కాదు దర్శకరత్న.  

Also Read: ప్రభాస్ నెంబర్ 1, మరి సెకండ్ ప్లేస్ ఏ హీరోది..?

Latest Videos


ప్రతీరోజు ఓ వంద మంది సినిమా వాళ్ళు అయినా.. దాసరి ఇంట్లో భోజనం చేసేవారు. ఎప్పుడూ వంటలు వండుతూనే ఉండేవారట. అలా దాసరి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక ముద్ర వేశారు. అంతే కాదు న్యూ ఇయర్ రోజు ఆయన చేతుల మీదుగా ఓ వందరూపాయల నోట్ తీసుకుంటే.. ఆ ఏడాది అంతా కలిసి వస్తుందనుకునేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. 

Also Read: నాగార్జున భోజనం ప్లేటులో తప్పకుండా ఉండేవి ఏంటో తెలుసా..?

స్టార్ హీరోలు.. పెద్ద పెద్దవారు కూడా దాసరి చేతుల మీదుగా వంద అందుకుంటుంటారు. ఈక్రమంలో దాసరి ఇండస్ట్రీలో ఎంతో మందికి మార్గదర్శి అయ్యారు. అటువంటి ఆయనచేత కంటతడిపెట్టించిందట ఓ హీరోయిన్ ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మహానటి సావిత్రి. 

అవును సావిత్రి వల్ల ఆయన కంటతడి పెట్టారట. సావిత్రిని తలుచుకున్నప్పుడల్లా ఆయనకు నీరు ఆగదు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దాసరి స్వయంగా వెల్లడించారు. సావిత్రి నన్ను తమ్ముడు తమ్మడు అని ప్రేమగా పిలిచేవారు. నేను కూడా అక్కా అంటూ చాలా ఆప్యాయతగా  ఉండేవాన్ని అన్నారు దాసరి. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం క్లిక్ చేయండి.

ఒకప్పుడు రాజభోగాలు చూసిన ఆమె.. చివరి రోజుల్లో ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు..అయినా సరే తన దాన గుణం మాత్రం మార్చుకోలేదు. చివరి రోజుల్లో కూడా ఎవరైనా దేహీ అని వస్తే ఎలాగైనా ఇచ్చేవారు. ఆమె మరణం తట్టుకోలేకపోయాను.. ఆ పరిస్థితి తలుకుకున్నప్పుడల్లా దుఖం ఆగదు అన్నారు దాసరి. 

దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో....

ఇక ఎవరైనా పెళ్ళి ఉంది అని వస్తే.. తన వస్తువులు అమ్మి మరీ సాయం చేసేవారట. సావిత్రం. అప్పట్లోనే పట్టుచీరలువేలల్లో ఉండేవి.. వాటినిఅమ్మి.. పెళ్ళిల్ళకు సాయం చేసేవారట. సావిత్రి. ఇలా ఆమెను తలుచుకుని దాసరి కన్నీరు పెట్టిన సందర్భాలు ఎన్నో. 

click me!