ఓటముల కంటే ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన జట్ల వివరాలు గమనిస్తే.. భారత్ ఇప్పటివరకు 580 మ్యాచ్ లను ఆడింది. ఇందులో విజయాలు 179 కాగా, 178 ఓటములు ఉన్నాయి. మిగిలిన 222 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఒక మ్యాచ్ టై అయింది. భారత్తో పాటు, ఓటముల కంటే ఎక్కువ విజయాలు సాధించిన ఇతర జట్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లు ఉన్నాయి.
ఆస్ట్రేలియా 414 విజయాలు, 232 ఓటములతో టాప్ లో ఉంది. ఇంగ్లాండ్ జట్టు 325 ఓటములు, 397 విజయాలతో రెండవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 179 విజయాలు, 161 ఓటములతో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఉన్న పాకిస్థాన్ 144 ఓటములు, 148 విజయాలు సాధించింది. భారతదేశం ఈ ప్రత్యేకమైన రికార్డును చేరుకోవడానికి అత్యధిక సమయం తీసుకుంది. 580 మ్యాచ్లు ఆడి-కనీసం ఒక్కసారైనా ఈ రికార్డును అందుకున్న ఏడు జట్లలో అత్యంత నెమ్మది జట్టుగా నిలిచింది.