గ్రాండ్మాస్టర్, ప్రపంచ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ డీ గుకేశ్ రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్పై విక్టరీతో దేశానికి గోల్డ్ మెడల్ అందించాడు. 45వ ఫిడే (FIDE) పోటీల్లో భారత ప్లేయర్లు డీ గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విడిత్ గుజరాతి, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయన్ వారి గేమ్ లలో సత్తా చాటడంతో భారత పురుషుల జట్టు గోల్డో మెడల్ గెలుచుకుంది. అలాగే, మహిళల జట్టు కూడా స్వర్ణం సాధించింది.
మహిళా జట్టు: హారిక ద్రోణవల్లి, వైశాలి రమేష్బాబు, దివ్య దేశ్ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్దేవ్, అభిజిత్ కుంటే (కెప్టెన్).
ఓపెన్ స్క్వాడ్: గుకేశ్ డి, ప్రజ్ఞానంద ఆర్, అర్జున్ ఎరిగైసి, విదిత్ గుజరాతీ, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్ (కెప్టెన్).