Chess Olympiad 2024 : చెస్ ఒలింపియాడ్ లో డ‌బుల్ గోల్డ్ - చ‌రిత్ర సృష్టించిన భార‌త్

First Published Sep 22, 2024, 7:58 PM IST

Chess Olympiad 2024 : 2024 చెస్ ఒలింపియాడ్ లో భారత్ రెండు స్వర్ణాలు  గెలిచి చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం భారత గ్రాండ్‌మాస్ట‌ర్ డీ. గుకేశ్(D.Gukesh)  ర‌ష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై విక్టరీతో ఓపెన్ విభాగంలో భారత్ కు తొలి గోల్డ్ మెడల్ అందించాడు. అలాగే, మ‌హిళ టీమ్ కూడా స్వర్ణం గెలుచుకోవడంతో భారత్ చరిత్ర లిఖించింది.

Chess Olympiad, India , Chess

Chess Olympiad 2024 : బుడాపెస్ట్ వేదిక‌గా జ‌రుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024 లో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి రెండు గోల్డ్ మెడ‌ల్ గెలుచుకుంది. ఓపెన్ సెక్షన్‌లో గ్రాండ్ మాస్ట‌ర్ డీ గుకేష్ అద్భుత ఆట‌తో భారతదేశం తమ మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత కొద్ది సేపటికే మహిళ టీమ్ కూడా అద్భుత ప్రదర్శనతో గోల్డ్ గెలుచుకోవడంతో భారత్ చరిత్ర లిఖించింది.

Chess Olympiad, India , Chess

గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఛాలెంజర్ డీ గుకేశ్ ర‌ష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై విక్టరీతో దేశానికి గోల్డ్ మెడల్ అందించాడు. 45వ ఫిడే (FIDE) పోటీల్లో భార‌త ప్లేయ‌ర్లు డీ గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విడిత్ గుజరాతి, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయన్ వారి గేమ్ ల‌లో స‌త్తా చాట‌డంతో భార‌త పురుషుల జ‌ట్టు గోల్డో మెడ‌ల్ గెలుచుకుంది. అలాగే, మ‌హిళ‌ల జ‌ట్టు కూడా స్వ‌ర్ణం సాధించింది. 

మహిళా జట్టు: హారిక ద్రోణవల్లి, వైశాలి రమేష్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్, అభిజిత్ కుంటే (కెప్టెన్).

ఓపెన్ స్క్వాడ్: గుకేశ్ డి, ప్రజ్ఞానంద ఆర్, అర్జున్ ఎరిగైసి, విదిత్ గుజరాతీ, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్ (కెప్టెన్).

Latest Videos


45వ FIDE చెస్ ఒలింపియాడ్‌లో భారతదేశం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇది దేశ చెస్ చరిత్రలో ఒక ప్రధాన మైలురాయి అని చెప్పాలి. భారత చెస్ స్టార్ ప్లేయ‌ర్లు డీ గుకేష్, అర్జున్ ఎరిగైసిల అద్భుతమైన ప్రదర్శనలతో ఈ విజయం సాధించింది. వారు తమ మ్యాచ్‌లలో కీలక విజయాలు సాధించి భార‌త్ ను అగ్రస్థానంలో నిల‌బెట్టారు. 

18 ఏళ్ల చెస్ సంచలనం డీ గుకేష్  వ్లాదిమిర్ ఫెడోసీవ్‌ను ఓడించడం ద్వారా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని విజయం జట్టు ఆధిపత్యాన్ని నిలబెట్టింది. గుకేశ్ దూకుడుగా ప్రారంభించి మంచి స్థానంతో విజయాన్ని సాధించాడు. 

ఒలింపియాడ్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 9/10 పాయింట్లు అతని వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని సాధించడమే కాకుండా బోర్డ్ వన్‌లో అతని అసాధారణ నైపుణ్యాన్ని హైలైట్ చేసింది. అలాగే, అర్జున్ ఎరిగైసి స్లోవేనియాతో జరిగిన బిగ్ గేమ్ లో భారత్ ఆధిక్యాన్ని మరింత పటిష్టం చేస్తూ జాన్ సుబెల్జ్‌ను ఓడించడం ద్వారా తన ప్రతిభను ప్రదర్శించాడు.

ఒలింపియాడ్‌లో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం. ఇక్కడే రెండో గోల్డ్ గెలిచి మరో ఘనత సాధించింది. ఇదిలావుండ‌గా, హారిక ద్రోణవల్లి, ఆర్ వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత మహిళల చెస్ జట్టు గోల్డ్ మెడల్ ను గెలుచుకోవడంతో భారత్ రెండో స్వర్ణం అందుకుంది. 

నవంబర్‌లో సింగపూర్‌లో జరిగే తదుపరి ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ని ఆడేందుకు సిద్ధంగా ఉన్న గుకేశ్ టాప్ సీడ్ జట్లపై తన అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో  ఉన్నత ర్యాంక్‌లో ఉన్న కరువానాను ఓడించి మరో ఉత్కంఠ గేమ్ ఆడాడు. మొత్తంగా చెస్ ఒలింపియాడ్ 2024 ఓపెన్ సెక్షన్‌లో భారత్ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది, చైనా, అమెరికా, ఉజ్బెకిస్థాన్‌లు త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

chess

అంతకుముందు శుక్రవారం (సెప్టెంబర్ 20) భారత పురుషుల జట్టు ఇరాన్‌పై 3.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఓపెన్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసింది. వారి గేమ్ లలో ఎనిమిదో విజయంతో భారత పురుషులు వారి సంఖ్యను 16 పాయింట్లకు చేర్చారు. సమీప ప్రత్యర్థి హంగేరీ, ఉజ్బెకిస్తాన్‌లపై రెండు పాయింట్లకు తమ ఆధిక్యాన్ని పెంచుకున్నారు.

2022 ఒలింపియాడ్ లో సొంతగడ్డపై కాంస్య పతకం సాధించిన భారత్ ఈ టైటిల్ పరుగుతో తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంది. అంతకుముందు 2014 ఎడిషన్ లో భారత్ కాంస్య పతకం సాధించింది.

click me!