ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి... టిడిపి ఎమ్మెల్యేలతో ర్యాలీగా అసెంబ్లీకి చంద్రబాబు

Nov 18, 2021, 11:33 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ఈ సమావేశం ప్రారంభానికి ముందు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టిడిపి చీఫ్ చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు. ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ప్రజాకంటక ప్రభుత్వం నశించాలి అని రాసివున్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ అసెంబ్లీ వరకు టిడిపి నాయకుల ర్యాలీ సాగింది.