ఘోరం.. పసివాడిమీద విరుచుకుపడ్డ వీధికుక్కలు.. సీసీ టీవీ ఫుటేజీ

Jun 9, 2020, 11:18 AM IST

కర్నూలు, ఆళ్లగడ్డలోని పోలీస్ లైన్ వీధిలో నాలుగేళ్ల బాలుడిపై అర్ధరాత్రి వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలో సీసీ టీవీ ఫుటేజి లభ్యమయ్యింది. ఎనిమిది కుక్కలు పసివాడిని వెంటాడి, వెంటాడి మరీ కరిచి చంపాయి.  అయితే నరసింహ అనే ఈ  బాలుడికి మతిస్థిమితం సరిగా లేదని, తల్లితోపాటు జీవిస్తున్నాడు. ఒంగోలు జైలులో ఉన్న తండ్రిని చూడడానికి తల్లి వెళ్లడంతో అర్థరాత్రి నిద్రలేచిన బాలుడు బయట తిరుగుతుండగా కుక్కులు దాడి చేశాయి. అరవడానికి కూడా వీలులేని పరిస్థితిలో అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికులు చూసి కుక్కలను తరిమేలోపే నరసింహ ప్రాణాలొదిలాడు.